Guntur: జిల్లాలో దంపతుల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-07-19T13:04:15+05:30 IST
ల్లాలో విషాద ఘటన జరిగింది. పొన్నూరు లోని సిద్ధి వినాయక నగర్ చెందిన దంపతులు..
గుంటూరు: జిల్లాలో విషాద ఘటన జరిగింది. పొన్నూరులోని సిద్ధి వినాయక నగర్కి చెందిన దంపతులు (couples) ఆత్మహత్యాయత్నానికి(suicide attempt) పాల్పడ్డారు. కూనప రెడ్డి శ్రీనివాసరావు, భార్య రమాదేవి మధ్య పశువులకు మేత వేసే విషయంలో వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన భార్య రమాదేవి పురుగులమందు తాగింది. వెంటనే భర్త శ్రీనివాసరావు కూడా పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఇద్దరిని పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. భార్యభర్తలిద్దరికి వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.