ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్ను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-12-02T05:51:50+05:30 IST
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్ను ఏర్పాటు చేయాలని సిటీ స్కాన్ సాధన సమితి కన్వీనర్ ఎం.ఎ. రహ్మన్, కో కన్వీనర్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
సంగారెడ్డి రూరల్, డిసెంబరు 1 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్ను ఏర్పాటు చేయాలని సిటీ స్కాన్ సాధన సమితి కన్వీనర్ ఎం.ఎ. రహ్మన్, కో కన్వీనర్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ జిల్లాకే పెద్దాసుపత్రి అయిన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో రెండు సంవత్సరాలుగా సిటీ స్కాన్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వీరి సంతకాల సేకరణకు సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ సంఘీభా వం తెలిపి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ఖాన్, నర్సింహులు, కాశీనాథ్, శివ కిరణ్కుమార్, జంగయ్య, ప్రసాద్, ఎం.నర్సింహులు, వీరయ్య, ఉదయ్, లక్ష్మణ్, వజీర్బేగ్ తదితరులు పాల్గొన్నారు.