ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T05:51:50+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్‌ను ఏర్పాటు చేయాలని సిటీ స్కాన్‌ సాధన సమితి కన్వీనర్‌ ఎం.ఎ. రహ్మన్‌, కో కన్వీనర్‌ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్‌ను ఏర్పాటు చేయాలి
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో సంతకాల సేకరణ చేపడుతున్న సిటీ స్కాన్‌ సాధన సమితి సభ్యులు

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 1 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్‌ను ఏర్పాటు చేయాలని సిటీ స్కాన్‌ సాధన సమితి కన్వీనర్‌ ఎం.ఎ. రహ్మన్‌, కో కన్వీనర్‌ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ జిల్లాకే పెద్దాసుపత్రి అయిన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో రెండు సంవత్సరాలుగా సిటీ స్కాన్‌ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వీరి సంతకాల సేకరణకు సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్‌ సంఘీభా వం తెలిపి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌ఖాన్‌, నర్సింహులు, కాశీనాథ్‌, శివ కిరణ్‌కుమార్‌, జంగయ్య, ప్రసాద్‌, ఎం.నర్సింహులు, వీరయ్య, ఉదయ్‌, లక్ష్మణ్‌, వజీర్‌బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:51:50+05:30 IST