AP News: వైసీపీ నేతల వేధింపులు తాళలేక దళిత యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-20T18:02:46+05:30 IST
జిల్లాలోని కావలిలోని ముసునూరు హరిజనపాళెంలో దారుణం చోటు చేసుకుంది.
నెల్లూరు: జిల్లాలోని కావలిలోని ముసునూరు హరిజనపాళెంలో దారుణం చోటు చేసుకుంది. దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల (YCP Leaders) వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కరుణాకరన్ సూసైడ్ లెటర్ రాశాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్రెడ్డి (Ketireddy jagadish reddy), సురేశ్రెడ్డి (Suresh reddy)లే కారణమని లేఖలో వెల్లడించాడు. రూ.20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే మూడేళ్లుగా పట్టనివ్వడం లేదని కరుణాకర్ ఆరోపించాడు. తాను, తన తల్లి వెళ్లి వైసీపీ నేతల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని యువకుడు సూసైడ్ లేఖలో ఆవేదన చెందాడు.