ఛీ.. ఛీ.. ఇద్దరు పిల్లల తండ్రి అయి ఉండి ఇదేం పాడు పని.. మైనర్ బాలికతో సహా ఊళ్లోంచి ఎస్కేప్ అయిన తర్వాత..

ABN , First Publish Date - 2021-10-12T14:11:51+05:30 IST

అతడికి వయసు పెరిగిద్ది తప్ప బుద్ధి పెరగలేదు. ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ ఓ పాడు పని చేశాడు. ఓ మైనర్ బాలికపై మనసు పడ్డాడు. అనంతరం ఆమెను ఊళ్లోంచి లేపుకెళ్లాడు.

ఛీ.. ఛీ.. ఇద్దరు పిల్లల తండ్రి అయి ఉండి ఇదేం పాడు పని.. మైనర్ బాలికతో సహా ఊళ్లోంచి ఎస్కేప్ అయిన తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి వయసు పెరిగిద్ది తప్ప బుద్ధి పెరగలేదు. ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ ఓ పాడు పని చేశాడు. ఓ మైనర్ బాలికపై మనసు పడ్డాడు. అనంతరం ఆమెను ఊళ్లోంచి లేపుకెళ్లాడు. ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉత్తర ప్రదేశ్‌లోని పాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామంలోని ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో అతడు ఇద్దరి పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. అయితే అతడికి వయసు పెరిగిందే తప్ప.. బుద్ధి ఏ మాత్రం పెరగలేదు. దీంతో అదే గ్రామంలోని ఓ మైనర్‌ బాలికపై మనసు పడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పెడ్డాడు. అయితే తెలిసీ తెలియని వయసు కావడంతో ఆ బాలిక.. అతడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే అతడు నాలుగు మైనర్ బాలికతో సహా అతడు ఊళ్లోంచి ఎస్కేప్ అయ్యాడు.



దీంతో సదరు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అతడిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు.. అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లడంతోపాటు ఇంటికి నిప్పంటించారు. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులను బాలిక కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. 




Updated Date - 2021-10-12T14:11:51+05:30 IST