AP News: కొడుకును హత్య చేయించిన తండ్రి

ABN , First Publish Date - 2022-08-14T00:32:13+05:30 IST

అన్నమయ్య జిల్లా: మదనపల్లె (Madanapalli) పట్టణంలో దారుణం జరిగింది. తండ్రే కన్నకొడుకును హత్య (Murder) చేయించిన ఘటన

AP News: కొడుకును హత్య చేయించిన తండ్రి

అన్నమయ్య జిల్లా: మదనపల్లె (Madanapalli) పట్టణంలో దారుణం జరిగింది. తండ్రే కన్నకొడుకును హత్య (Murder) చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఠాగూర్ నాయక్ వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి చెప్పిన మాట వినడం లేదు. తననే హత్య చేస్తాడని భయంతో తండ్రి రెడ్డప్ప నాయక్ కొడుకును చంపేయాలని ప్లాన్ చేశాడు. రూ.2 లక్షలు సుపారి ఇచ్చి కొడుకును హత్య చేయించాడు. హత్య జరిగిన నెలరోజుల తర్వాత పోలీసుల విచారణలో ఈ విషయం బయటకు వచ్చింది.  

Updated Date - 2022-08-14T00:32:13+05:30 IST