బాలిక తల్లిదండ్రులు బెదిరించడంతో మహిళా హోం గార్డ్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-26T01:35:03+05:30 IST
Prakasham: మా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్లాడంటూ అబ్బాయి తల్లిని దబాయించారు. ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పాలని బెదిరించారు. అమ్మాయి కుటుంబసభ్యుల మాటలకు తీవ్ర మనస్తాపం చెంది అబ్బాయి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన
Prakasham: మా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్లాడంటూ అబ్బాయి తల్లిని దబాయించారు. ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పాలని బెదిరించారు. అమ్మాయి కుటుంబసభ్యుల మాటలకు తీవ్ర మనస్తాపం చెంది అబ్బాయి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
కంభం మండలం లింగాపురంలో మహిళా హోం గార్డ్ (Home guard) సాలమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె కొడుకు వినయ్ ఓ బాలికను ప్రేమించి తీసుకెళ్లాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తమ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పాలని సాలమ్మను బెదిరించారు. వారి మాటలకు తీవ్ర మనస్తాపం చెంది సాలమ్మ విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సాలమ్మ తన డైరీలో ఆత్మహత్యకు గల కారణాలు రాసింది. సాలమ్మ మృతికి కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.