చేపల వల చిక్కుకొని మత్స్యకారుడి మృతి

ABN , First Publish Date - 2022-07-01T05:26:14+05:30 IST

చేపల వల చిక్కుకొని మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన గురువారం మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

చేపల వల చిక్కుకొని మత్స్యకారుడి మృతి

 మిరుదొడ్డి, జూన్‌ 30: చేపల వల చిక్కుకొని మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన గురువారం మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. మిరుదొడ్డి ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... కాసులాబాద్‌ గ్రామానికి చెందిన మత్స్యకారుడు కంది యాదగిరి(48) గ్రామంలోని ఊరచెరువులో చేపల వేటకు వెళ్లాడు. చెరువులో దిగి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చేపలవల చిక్కుకుని నీటిమునిగి చనిపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు దగ్గరికి వెళ్లిచూసే సరికి నీటిలో మృతదేహం తేలి ఉంది. మిరుదొడ్డి పోలీసులు అక్కడకు చేరుకుని, కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య పుష్పలత, కుతూరు అనన్య, కుమారుడు ధనుష్‌ ఉన్నారు.


 

Updated Date - 2022-07-01T05:26:14+05:30 IST