ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం.. తాజాగా ఆమె గుట్టురట్టు.. ఆ తర్వాత జరిగింది ఇదీ..

ABN , First Publish Date - 2022-02-26T20:29:30+05:30 IST

ఒకరి విషయం మరొకరికి తెలియకుండా ఓ యువతి ఇద్దరితో ప్రేమాయణం సాగించింది. తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇన్ని రోజులూ బాగానే మ్యానేజ్ చేసింది. అయితే తాజాగా ఆమె గుట్టురట్టైంది. తమ ప్రే

ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం.. తాజాగా ఆమె గుట్టురట్టు.. ఆ తర్వాత జరిగింది ఇదీ..

ఇంటర్నెట్ డెస్క్: ఒకరి విషయం మరొకరికి తెలియకుండా ఓ యువతి ఇద్దరితో ప్రేమాయణం సాగించింది. తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇన్ని రోజులూ బాగానే మ్యానేజ్ చేసింది. అయితే తాజాగా ఆమె గుట్టురట్టైంది. తమ ప్రేయసి మరో వ్యక్తితో కూడా రిలేషన్‌‌లో ఉందని ఆ యువకులకు తెలిసిపోయింది. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



గురువారం ఉదయం ఢిల్లీలోని రాజా గార్డెన్ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బులెట్ గాయంతో బాధపడుతున్న సాత్వీందర్ అనే యువకుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా జామియా నగర్‌కు చెందిన దావూద్ అనే యువకుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద ఉన్న తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ గౌతమ్ మీడియా మాట్లాడుతూ.. సాత్వీందర్, దావూద్ అనే ఇద్దరు యువకులతో ఓ యువతి ఒకేసారి ప్రేమాయణం నడిపిందని వెల్లడించారు. ఈ విషయం తాజాగా బయటపడటంతో ఆ యువతిని ప్రేమించిన ఇద్దరు యువకులు ఘర్షణకు దిగినట్టు పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సాత్వీందర్‌పై దావూద్‌ కాల్పులు జరిపిట్టు తెలిపారు. ఈ కాల్పుల్లో సాత్వీందర్‌ కాలికి గాయం అయినట్టు వెల్లడించారు.




Updated Date - 2022-02-26T20:29:30+05:30 IST