18 ఏళ్ల యువతిని చంపి.. ఇంట్లోనే రెండ్రోజుల పాటు మృతదేహాం.. ఆ కుటుంబం ఇంత దారుణం ఎందుకు చేసిందంటే..

ABN , First Publish Date - 2021-07-20T20:44:29+05:30 IST

కన్న కూతురినే అత్యంత కిరాతకంగా చంపేశారు.. మృతదేహాన్ని ఇంట్లోనే రెండ్రోజుల పాటు ఉంచారు..

18 ఏళ్ల యువతిని చంపి.. ఇంట్లోనే రెండ్రోజుల పాటు మృతదేహాం.. ఆ కుటుంబం ఇంత దారుణం ఎందుకు చేసిందంటే..

కన్న కూతురినే అత్యంత కిరాతకంగా చంపేశారు.. మృతదేహాన్ని ఇంట్లోనే రెండ్రోజుల పాటు ఉంచారు.. ఆ తర్వాత ఓ చెరువులోకి విసిరేశారు.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతి హత్యకు కారణాలు తెలుసుకున్నారు.. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఝార్ఖండ్‌లో గొడ్డా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ఝార్ఖండ్‌లో గొడ్డా ప్రాంతానికి చెందిన ఓల్కీ కుమారి (18) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే కులాంతరం పేరుతో ఆ ప్రేమను పెద్దలు ఆమోదించలేదు. దీంతో ఓల్కీని వేరే ఊరుకు పంపించి అక్కడ ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. అయితే ఆ పెళ్లి చేసుకునేందుకు ఓల్కీ అంగీకరించలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. దీంతో ఓల్కీ తండ్రి, తాతయ్య, మామయ్య ఈ నెల 10న ఆమెను హత్య చేశారు. 


మృతదేహాన్ని రెండ్రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. 12వ తేదీ రాత్రి కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు. తర్వాతి రోజు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఓల్కీ కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ప్రేమ వివాహం ఇష్టం లేక ఓల్కీని తామే అంతమొందించినట్టు కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-20T20:44:29+05:30 IST