వినాయకుడికి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-09-17T05:29:20+05:30 IST

వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని వివిధ మండపాల్లో ప్రతిష్టించిన దాదాపు 55 వినాయకుడి విగ్రహాలను గురువారం నిమజ్జ నానికి తరలించారు.

వినాయకుడికి వీడ్కోలు
నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్న కళాకారులు, ప్రజలు

- జిల్లా కేంద్రంలో వైభవంగా శోభాయాత్ర 

- స్వాగతం పలికిన ఉత్సవ సమితి నాయకులు

- నదీ అగ్రహారం వద్ద కృష్ణానదిలో నిమజ్జనం

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 16 : వినాయక చవితి  సందర్భంగా పట్టణంలోని వివిధ మండపాల్లో ప్రతిష్టించిన దాదాపు 55 వినాయకుడి విగ్రహాలను గురువారం నిమజ్జ నానికి తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహిం చిన  శోభా యాత్ర అందరినీ విశేషంగా ఆకట్టుకున్నది. ముని సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ ఉత్సవంలో పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గణేష్‌ ఉత్సవ సమితి స్థానిక పాతబస్టాండ్‌ సర్కిల్‌లో స్వాగత వేదికను ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథులు మండపాల నిర్వాహకులను సన్మానించి జ్జాపికలను అందజేశారు. అనంతరం నదీ ఆగ్రహారం సమీపంలోని కృష్ణానదిలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి కన్వీనర్‌ అల్లూరి ఫణిమోహన్‌రావు అధ్యక్షుడు బండల వెంక ట్రాములు, కార్యదర్శి ఆలూరు బిలకంటి రాము, కోశాధికారి ఆనంద్‌, మురళీకృష్ణ, మల్లికార్జున సాక్రే, పీ.వీ. బద్రినాథ్‌, సుమలత, గడ్డం కృష్ణారెడ్డి, భీంసేన్‌రావు, మోహన్‌బాబు, బొట్టు సుధాకర్‌, పులిపాటి వెంకటేష్‌, భాస్కర్‌యాదవ్‌, ఎం.కే. ప్రవీణ్‌, జనార్ధన్‌, ప్రసన్నచారి, మల్లికార్జున్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-17T05:29:20+05:30 IST