కైకలూరు విద్యార్థికి భారీ ప్యాకేజీ
ABN , First Publish Date - 2022-09-11T02:36:42+05:30 IST
కేంపస్ ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన ఏలూరు జిల్లా కైకలూరు విద్యార్థి రూ.32 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యాడు. కైకలూరుకు చెందిన తమ్మిరెడ్డి వెంకట అప్పారావు మండవల్లి..
కైకలూరు: కేంపస్ ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన ఏలూరు జిల్లా కైకలూరు విద్యార్థి రూ.32 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యాడు. కైకలూరుకు చెందిన తమ్మిరెడ్డి వెంకట అప్పారావు మండవల్లి మండలం చింతపాడు జడ్పీ హైస్కూల్లో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన రెండో కుమారుడైన అరవింద్ తమిళనాడులోని తిరుచ్చి నిట్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఒరాకిల్ సంస్థ నిర్వహించిన కేంపస్ ఇంటర్వ్యూల్లో అరవింద్ ఎంపికై ఈ భారీ మొత్తాన్ని వార్షిక వేతనంగా అందుకోబోతున్నాడు. జేఈఈ మెయిన్స్లో 99.86 శాతం సాధించి నిట్ కళాశాలలో సీట్ పొందాడు. అరవింద్ ఈ ప్యాకేజ్కి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.