ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2022-05-26T06:11:12+05:30 IST

జాతీయ రహదారిపై అగనంపూడి కూడలిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
ధ్వంసమైన బస్సు వెనుక భాగం

ఇద్దరికి తీవ్ర గాయాలు

అగనంపూడి, మే 25: జాతీయ రహదారిపై అగనంపూడి కూడలిలో  ఆగి ఉన్న ఆర్టీసీ బస్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు మరో ప్రయాణికుడికి  తీవ్ర గాయాలయ్యాయి.  పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...అనకాపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం నగరానికి వస్తుండగా, అగనంపూడి జంక్షన్‌లో ప్రయాణికుల కోసం డ్రైవర్‌ నిలిపారు. ఈక్రమంలో వెనుక వస్తున్న లారీ ఆగి ఉన్న బస్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ ఎన్‌.వెంకటసూర్యకృష్ణతోపాటు ప్రయాణికుడు  యు.హరికృష్ణకి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్‌లో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-26T06:11:12+05:30 IST