చింతాలమ్మ ఘాట్లో 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన లారీ
ABN , First Publish Date - 2022-05-21T06:48:16+05:30 IST
మండలంలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి జీడికర్రల లారీ బ్రేక్లు ఫెయిల్ కావడంతో 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది.
కొయ్యూరు, మే 20: మండలంలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి జీడికర్రల లారీ బ్రేక్లు ఫెయిల్ కావడంతో 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ దుర్గాప్రసాద్ అందించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని నడింపాలెం గ్రామానికి చెందిన సుంకరి పండుకు చెందిన 30 టన్నుల జీడిమామిడి కర్రల లోడుతో బయలుదేరిన లారీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో చింతాలమ్మ ఘాట్ మూడవ మలుపు వద్ద 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ దుర్గాప్రసాద్ దూకేందుకు ప్రయత్నించగా డోర్ ఓపెన్ కాలేదు. అయితే లారీ వెనుక ద్విచక్రవాహనంపై వస్తున్న యజమాని పండు.. డ్రైవర్ కేకలు విని ఆగాడు. తర్వాత అతికష్టం మీద లోయలోకి దిగి లారీ డోర్ తెరవడంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. లారీలో డ్రైవర్ మినహా మరెవ్వరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.