అత్తారింటికొచ్చి మరీ ఇదేం పనయ్యా బాబూ.. పోలీసుల ఎంట్రీతో అల్లుడి నిర్వాకమేంటో తెలిసి విస్తుపోయిన స్థానికులు..!
ABN , First Publish Date - 2021-10-25T23:25:39+05:30 IST
ఎప్పుడూ బిజీగా ఉండే అల్లుడు రాక రాక తమ ఇంటికి రావడంతో ఆ కుటంబ సభ్యులు అంతా ఆనందపడ్డారు. మర్యాదల్లో ఏలోటూ రాకుండా చూసుకున్నారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ కుటంబ సభ్యులంతా అవాక్కయ్యారు. ఏం జరిగి ఉంటుందని కంగారు పడ్డారు. ఆ తర్వాత తమ అల్లు చేస్తున్న నిర్వాకం తెలియడంతో షాకయ్యా
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ బిజీగా ఉండే అల్లుడు రాక రాక తమ ఇంటికి రావడంతో ఆ కుటంబ సభ్యులు అంతా ఆనందపడ్డారు. మర్యాదల్లో ఏలోటూ రాకుండా చూసుకున్నారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ కుటంబ సభ్యులంతా అవాక్కయ్యారు. ఏం జరిగి ఉంటుందని కంగారు పడ్డారు. ఆ తర్వాత తమ అల్లు చేస్తున్న నిర్వాకం తెలియడంతో షాకయ్యారు. చతీస్గఢ్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
చతీస్గఢ్లోని బిల్సాపూర్కు చెందిన కరణ్ అనే వ్యక్తి.. ఎప్పుడూ ఏదో పనిపై బిజీ బిజీగా ఉంటాడు. అతడు తన అత్తారింటికి వెళ్లడం చాలా అరుదు. అయితే ఆదివారం రోజు కరణ్ తన అత్తారింటికి వెళ్లి అక్కడున్న వారికి షాకిచ్చాడు. ఎప్పుడో గానీ రాని అల్లుడు అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వడంతో కొద్దిసేపటి వరకు ఆశ్చర్యపోయిన ఆ కుటంబ సభ్యులు ఆ తర్వాత సంబరపడ్డారు. మర్యాదల్లో ఏలోటూ రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి అందరూ కలిసి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తున్న సమయంలో సడన్గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ కుటంబ సభ్యులు కంగుతిన్నారు. విషయం ఏంటా అని ఆరా తీసి తలలు పట్టుకున్నారు. తమ అల్లుడు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు తెలుసుకుని విస్తుపోయారు. కాగా.. కరణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని జైలుకు తరలించారు.
ఈ క్రమంలో పోలీసులు అధికారులు మాట్లాడుతూ.. ఆదివారం ఇండియా-పాక్ మ్యాచ్ సందర్భంగా భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్టు సమాచారం అందడంతో నిఘా పెట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే కరణ్తోపాటు మరో ఐదుగురు బూకీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.25వేలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాగా.. ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.