ప్రేమ పెళ్లి.. భార్య నుంచి వాట్సప్ మెసేజ్.. చదివి నివ్వెరపోయిన భర్త.. ఇంతకీ అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-10-22T00:54:20+05:30 IST

తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సెల్వన్(29) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే కంపెనీలో పని చేస్తున్నఇళమతి(23) అనే యువతితో ఏర్పడ్డ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రేమ పెళ్లి.. భార్య నుంచి వాట్సప్ మెసేజ్.. చదివి నివ్వెరపోయిన భర్త.. ఇంతకీ అసలు కథేంటంటే..

వారిద్దరూ ప్రేమించుకున్నారు. చాలా ప్రేమకథల మాదిరిగానే పెద్దలు మాత్రం.. వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. మేజర్లు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. అయితే సమస్య అక్కడితో అయిపోలేదు. సినిమా స్టోరీని తలపించేలా చాలా మలుపులు తిరిగింది. ఆఖరకు రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేయలేదు.. అయితే మీడియాకు తెలియడంతో ఎట్టకేలకు స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సెల్వన్(29) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే కంపెనీలో పని చేస్తున్నఇళమతి(23) అనే యువతితో ఏర్పడ్డ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి.. పెళ్లికి నిరాకరించారు. అయితే వారు మేజర్లు కావడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసి వారి పెద్దలు కోపం పెంచుకున్నారు.


కొన్నాళ్ల పాటు వారి సంసారం సజావుగా సాగింది. తర్వాత మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. యువతి కుటుంబ సభ్యులు వారి వద్దకు వెళ్లి.. యువకుడిని కొట్టి, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. దీనిపై సెల్వన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వారు కేసు నమోదు చేయలేదని, అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రికి ఇళమతి కుటుంబానికి బంధుత్వం ఉందని.. అందుకే పట్టించుకోలేదని మీడియా ముందు ఆరోపించాడు. తనకు ప్రాణహాని ఉందని భార్య వాట్సప్ మెసేజ్ చేయడంతో షాక్ అయిన యువకుడు.. విషయాన్ని వివరించడంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-22T00:54:20+05:30 IST