అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-07-26T06:19:26+05:30 IST

ఒక వ్యక్తి ఆదివారం అమలాపురంలోని లాడ్జిలో మృతిచెంది ఉన్నాడు.

అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

అమలాపురం టౌన్‌, జూలై 25: ఒక వ్యక్తి ఆదివారం అమలాపురంలోని లాడ్జిలో మృతిచెంది ఉన్నాడు. కొంతకాలంగా గుండె సంబంధ అనారో గ్యంతో బాధపడుతున్న  ముక్కామలకు చెందిన ఆకెళ్ల కిరణ్‌కుమార్‌(43) కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఒక లాడ్జిలో దిగిన అతడు ఆదివారం తలుపులు తీయకపోవడంతో సిబ్బంది పోలీసు లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా  అతడు మృతి చెంది ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్‌ తెలిపారు. 


Updated Date - 2021-07-26T06:19:26+05:30 IST