చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-02-28T06:59:55+05:30 IST
రోడ్డుర పమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కాకినాడలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
అంబాజీపేట, ఫిబ్రవరి 27: రోడ్డుర పమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కాకినాడలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్ఐ షేక్ జానీబాషా వివరాల ప్రకారం.. పి.గన్నవరం మండలం కె.ముంజువరానికి చెందిన గాడా శ్రీనివాసరావు(42) ఈనెల1న మోపెడ్పై అంబాజీపేట సెంటర్కు టిఫిన్ కోసం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మాచవరం బళ్ల పట్టిలింగం ఆసుపత్రి వద్ద కంకర గుట్టను బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.