మద్యం తాగేందుకు నిరాకరించిన భార్య.. మద్యంమత్తులో రాత్రి పశువుల కొట్టంలోకి వెళ్లిన భర్త.. అక్కడ అతడు చేసిన పనేంటంటే..

ABN , First Publish Date - 2022-01-10T14:32:08+05:30 IST

అతడికి ప్రస్తుతం 33ఏళ్లు. కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే మద్యానికి బానిసైన అతడు.. రోజూ పీకలదాక మందుకొట్టేవాడు. ఈ క్రమంలోనే తాజాగా మద్యం సీసాను ఇంటికే తెచ్చుకున్నాడు. తనతోపాటు మద్యం సేవించాలని భార్య

మద్యం తాగేందుకు నిరాకరించిన భార్య.. మద్యంమత్తులో రాత్రి పశువుల కొట్టంలోకి వెళ్లిన భర్త.. అక్కడ అతడు చేసిన పనేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ప్రస్తుతం 33ఏళ్లు. కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే మద్యానికి బానిసైన అతడు.. రోజూ పీకలదాక మందుకొట్టేవాడు. ఈ క్రమంలోనే తాజాగా మద్యం సీసాను ఇంటికే తెచ్చుకున్నాడు. తనతోపాటు మద్యం సేవించాలని భార్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపంతో పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లాడు. అక్కడ అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. 



రాజస్థాన్‌లోని లరాతి గ్రామానికి చెందిన కేశవ్‌లాల్ (33)కు కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే మద్యానికి బానిసైన కేశవ్‌లాల్.. రోజూ పూటుగా మద్యం సేవించేవాడు. ఆదివారం రాత్రి మద్యం సీసాను ఏకంగా ఇంటికే తీసుకెళ్లిన అతడు.. తాగాలంటూ భార్యను బలవంతం చేశాడు. అయితే ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో పశువుల కొట్టంలోకి వెళ్లిన కేశవ్‌లాల్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశువులు విపరీతంగా అరవడంతో అక్కడకు వెళ్లి చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-01-10T14:32:08+05:30 IST