భార్యాపిల్లలను ఆటోలో కూర్చోమన్నాడా భర్త.. ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అనుకుని ఎక్కారు.. మరుక్షణమే ఘోరం..!

ABN , First Publish Date - 2022-05-06T22:04:58+05:30 IST

అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ క్రమంలో తాజాగా అతడు తన భార్య పిల్లలను ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అందర్నీ తన ఆటోలో కూర్చొమన్నాడు. అతడి

భార్యాపిల్లలను ఆటోలో కూర్చోమన్నాడా భర్త.. ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అనుకుని ఎక్కారు.. మరుక్షణమే ఘోరం..!

ఇంటర్నెట్ డెస్క్: అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ క్రమంలో తాజాగా అతడు తన భార్య పిల్లలను ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అందర్నీ తన ఆటోలో కూర్చొమన్నాడు. అతడి మాటలతో భార్య పిల్లలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమను ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అని భావించి, అతడు చెప్పినట్టే ఆటో ఎక్కేశారు. ఆ మరుక్షణమే ఘోరం జరిగిపోయింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన మహ్మద్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ దంపతులు ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో మహ్మద్ మే 5న తన భార్యబిడ్డలను ఇంటి నుంచి బయటకు పిలిచాడు. అందర్నీ ఆటోలో కూర్చోమని చెప్పాడు. దీంతో తమను ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అని భావించిన ఆ భార్యబిడ్డలు.. మారు మాట్లాడకుండా మహ్మద్ చెప్పినట్టే చేశారు. ఆటోలో ఎక్కి కూర్చున్నారు. అనంతరం అతడు దారుణానికి పాల్పడ్డాడు. భార్యపిల్లలు ఎక్కిన ఆటోకు నిప్పటించి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 



ఈ దుర్ఘటనలో మహ్మద్‌, అతడి భార్య, 9ఏళ్ల కూతురు ప్రాణాలు కోల్పోగా.. 5 ఏళ్ల చిన్నారి మాత్రం తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధికారులు.. పోక్సో కేసులో మహ్మద్‌ నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కేరళలో మార్చి 19న కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా హమీద్ అనే వ్యక్తి తన కొడుకు, కోడలు, వారి పిల్లలను ఇంట్లో బంధించి ఇంటికి నిప్పటించాడు.


Read more