Bengaluru: ఈ ఫేస్ చూస్తే ఎవరూ అలా చేస్తాడని అనుకోరు.. ఇంత అమాయకంగా కనిపిస్తూ..

ABN , First Publish Date - 2022-04-30T20:45:29+05:30 IST

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని 24 ఏళ్ల యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి..

Bengaluru: ఈ ఫేస్ చూస్తే ఎవరూ అలా చేస్తాడని అనుకోరు.. ఇంత అమాయకంగా కనిపిస్తూ..

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని 24 ఏళ్ల యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగేష్ అనే యువకుడు బెంగళూరులో ఓ గది తీసుకుని అద్దెకు ఉండేవాడు. ఆ ఇంటి యజమాని బాధిత యువతికి అంకుల్ కావడంతో అప్పుడప్పుడూ ఆమె తన అంకుల్ ఇంటికి వెళుతుండేది. ఆ క్రమంలోనే.. నగేష్ కన్ను సదరు యువతిపై పడింది. ఏడేళ్లుగా అదే ఇంటిపై రూంలో అద్దెకు ఉంటున్న నగేష్ ఆ యువతిని ప్రేమ పేరుతో ఇబ్బందిపెట్టాడు. ఆమె ఆసక్తి చూపకపోవడంతో వెంటపడి మరీ తనను ప్రేమించాలని మూర్ఖంగా ప్రవర్తించేవాడు.



ఆమెకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడేవాడు. నగేష్ వేధింపులు భరించలేక విషయాన్ని ఆమె అంకుల్‌కు చెప్పింది. నగేష్ గురించి తెలుసుకున్న ఆ ఇంటి ఓనర్ రూం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ గది ఖాళీ చేసి వెళ్లిపోయినా నగేష్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ మధ్యనే ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోందని తెలుసుకున్న నగేష్ మళ్లీ ఆమె వెంటపడటం మొదలుపెట్టాడు. ఆమె పనిచేసే దగ్గరికి వెళ్లి కూడా ఇబ్బందిపెట్టాడు. గత బుధవారం.. మరింత రెచ్చిపోయి ఆ యువతి పనిచేస్తున్న ఆఫీస్‌లోకి వెళ్లి పెద్ద సీన్ చేశాడు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆ సమయంలో.. తనకు అతనంటే ఇష్టం లేదని, ఒక అన్నలా భావించానని బాధిత యువతి తేల్చి చెప్పింది.



నగేష్ చేసిన రచ్చ గురించి యువతి ఆంటీ అతని సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. తన తమ్ముడిని తాను కంట్రోల్‌లో పెడతానని, ఇకపై ఆ యువతిని వేధించకుండా దారిలో పెడతానని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా యువతి కుటుంబం ఆగింది. కానీ.. గురువారం ఉదయం ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. గురువారం ఉదయం 9 గంటలకు సదరు యువతి ఆఫీస్‌కు వెళుతోంది. ఆమెకు కనిపించకుండా యువతిని ఫాలో అయిన నగేష్ ఆమెపై యాసిడ్ దాడికి తెగబడ్డాడు. యాసిడ్ దాడిలో గాయపడిన ఆమె కేకలు వేయడంతో నగేష్ అక్కడి నుంచి భయంతో పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి స్పందిస్తూ.. తమ కూతురు ప్రాణాలతో బయటపడిందని డాక్టర్లు చెప్పారని.. తమ కళ్ల ముందే నిందితుడిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలు ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘సార్.. అతనిని విడిచిపెట్టకండి. కఠినంగా శిక్షించండి’ అని కాలిన గాయాల బాధలో తన ఆవేదన వెళ్లగక్కింది.

Updated Date - 2022-04-30T20:45:29+05:30 IST