ట్యూషన్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం.. నాలుగో రోజు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం.. ఏమైపోయావని తల్లి నిలదీస్తే ఆమె ఏడుస్తూ..

ABN , First Publish Date - 2021-07-28T16:37:50+05:30 IST

ప్రతిరోజులాగానే ఆ రోజు ఉదయం కూడా ఆ బాలిక ట్యూషన్‌కు బయలుదేరింది..

ట్యూషన్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం.. నాలుగో రోజు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం.. ఏమైపోయావని తల్లి నిలదీస్తే ఆమె ఏడుస్తూ..

ప్రతిరోజులాగానే ఆ రోజు ఉదయం కూడా ఆ బాలిక ట్యూషన్‌కు బయలుదేరింది.. అయితే ఎంత సేపటికీ తిరిగి రాలేదు.. సాయంత్రం వరకు ఆ బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.. పోలీసులు కూడా ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. కనిపించకుండా పోయిన నాలుగు రోజుల తర్వాత ఆ బాలిక పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది.. ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.. ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి మూడ్రోజుల పాటు అత్యాచారం చేశారని చెప్పింది. బీహార్‌లోని బంకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 


ఈ నెల 22వ తేదీ ఉదయం గోడా బజార్ ప్రాంతంలో నడిచి వెళ్తున్న బాలికను దీపక్ అనే వ్యక్తి బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లి ఓ గదిలో బంధించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని స్నేహితులు చందన్, రంజన్ కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు ఆ బాలిక గురించి వెతుకుతుండడంతో ఆ ముగ్గురూ భయపడ్డారు. నాలుగో రోజు వారే ఆ బాలికను పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చి పరారయ్యారు. 


బాలిక దొరికిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడగా.. అసలు విషయం తెలిసిందే. దీపక్, చందన్, రంజన్ అనే వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలిక నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని ఆమెను మెడికల్ చెకప్‌నకు పంపారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-28T16:37:50+05:30 IST