కుమారుని పరిస్థితి చూసి డిప్రెషన్‌లోకి వెళ్లిన తల్లి... తనలోని తల్లి ప్రేమను చంపేస్తూ, ఆమె ఎంతటి కఠిన నిర్ణయం తీసుకున్నదంటే...

ABN , First Publish Date - 2022-08-06T17:23:21+05:30 IST

పిల్లలకు జన్మనివ్వడమే కాకుండా...

కుమారుని పరిస్థితి చూసి డిప్రెషన్‌లోకి వెళ్లిన తల్లి... తనలోని తల్లి ప్రేమను చంపేస్తూ, ఆమె ఎంతటి కఠిన నిర్ణయం తీసుకున్నదంటే...

పిల్లలకు జన్మనివ్వడమే కాకుండా వారిని పెంచి పోషిస్తున్నందున తల్లిని పిల్లలకు సరైన రక్షకురాలని అంటారు. పిల్లలు కూడా తమ తల్లికి అత్యంత సన్నిహితంగా ఉండడానికి కారణం ఇదే. అయితే బెంగళూరులో ఓ తల్లి తాను కన్న కొడుకునే హతమార్చింది. ఐదేళ్ల ఆ పిల్లాడు తన తల్లి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో ఓ మహిళ తన ఐదేళ్ల కుమారుడిని అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ పిల్లాడు మానసిక వికలాగుడు కావడంతో తల్లి డిప్రెషన్‌లోకి వెళ్లింది. 


ఈ నేపధ్యంలోనే తన కుమారుడిని బాల్కనీ నుంచి తోసేసింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ సమాచారం అందించడంతో పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ తల్లి ఉద్దేశపూర్వకంగానే తన కుమారుడిని బాల్కనీ నుంచి తోసేసిందని, తల్లిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. 



Updated Date - 2022-08-06T17:23:21+05:30 IST