ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
ABN , First Publish Date - 2022-08-07T04:57:38+05:30 IST
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి దేశంలో అమృతోత్సవాలు జరుపు కుంటున్న తరుణం లో ప్రతి ఇంటిపై జాతీ య జెండా ఎగరేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్షనాయుడు పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరు అర్బన్ ఆగస్టు 6 : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి దేశంలో అమృతోత్సవాలు జరుపు కుంటున్న తరుణం లో ప్రతి ఇంటిపై జాతీ య జెండా ఎగరేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్షనాయుడు పిలుపునిచ్చారు.శనివారం స్థానిక చౌడేశ్వరీ నగర్లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాలను బీజేపీ కార్యకర్తలకు పంపిణిచేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదిలక్షల జాతీయ జెండాలను పంపిణీ చేసి ప్రతి ఇంటి మీద ఎగురవేసి రాజకీయాలకు అతీతంగా దేశభక్తిని చాటుకోవాలన్నారు. కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మండల ఉపాధ్యక్షుడు ప్రకాష్ తదితరులుపాల్గొన్నారు.