శాశ్వత వంతెనను నిర్మించాలి

ABN , First Publish Date - 2022-07-01T05:25:52+05:30 IST

చేర్యాల మండలం కడవేరుగు గ్రామశివారులో తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టవద్దని, శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ సీపీఎం నాయకులు గురువారం నిరసన తెలిపారు.

శాశ్వత వంతెనను నిర్మించాలి

 చేర్యాల, జూన్‌ 30: చేర్యాల మండలం కడవేరుగు గ్రామశివారులో తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టవద్దని, శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ సీపీఎం నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ మండల కమిటీసభ్యుడు కత్తుల భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరదనీటి ప్రవాహ ఇబ్బందులు తొలగించేందుకు రూ.1.60కోట్లు మంజూరయ్యాయని ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ రూ.10లక్షలతో తాత్కాలిక వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం తగదన్నారు. నిధులు పక్కదోవపట్టించి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. వెంటనే శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, సత్తయ్య, లక్ష్మి, కనకచారి తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-07-01T05:25:52+05:30 IST