పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-01T05:26:43+05:30 IST

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతిచెందాడు. తిప్పారం గ్రామానికి చెందిన ఈసల కరుణాకర్‌ వ్యవసాయంతో పాటు వరికోత మిషన్‌ను నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి

 కొండపాక, జూన్‌ 30: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతిచెందాడు. తిప్పారం గ్రామానికి చెందిన ఈసల కరుణాకర్‌ వ్యవసాయంతో పాటు వరికోత మిషన్‌ను నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయంలో పెట్టుబడులకు, మిషన్‌ కొనుగోలుకు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో కలత చెందిన ఆయన మంగళవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుకునూర్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


 

Updated Date - 2022-07-01T05:26:43+05:30 IST