విద్యార్థినికి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-03-09T06:34:48+05:30 IST

స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న మల్లిపురం పూజితకు అరుగైన గౌరవం లభించింది.

విద్యార్థినికి అరుదైన గౌరవం
పూజితను హెచ్‌ఎం సీట్‌లో కూర్చోబెట్టి గౌరవిస్తున్న దృశ్యం

పలాస : స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న మల్లిపురం పూజితకు అరుగైన గౌరవం లభించింది. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భం గా ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. సోమవారం విద్యార్థులకు ‘సమాజా భివృద్ధిలో మహిళల పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పూజిత ప్రఽథమ స్థానం సాధించడంతో ఘనంగా సన్మానించారు. దీంతో పాటు పూజితకు ప్రధానోపాధ్యాయుడి కుర్చీలో కూర్చొనే అరుదైన అవకాశం కల్పిం చారు. కార్యక్రమంలో హెచ్‌ఎం డి.రామారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T06:34:48+05:30 IST