ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నీచుడు

ABN , First Publish Date - 2022-08-16T09:20:39+05:30 IST

రాజగోపాల్‌రెడ్డి మోసకారి మాటలను మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని, గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నీచుడు ఆయనని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నీచుడు

రాజగోపాల్‌రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు

బీజేపీలో చేరి తన గొయ్యి తానే తవ్వుకున్నారు..

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి 

మునుగోడు ఇండిపెండెంట్‌ ఎంపీటీసీ, కొత్తగూడెం సర్పంచ్‌ టీఆర్‌ఎ్‌సలో చేరిక 


నల్లగొండ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజగోపాల్‌రెడ్డి మోసకారి మాటలను మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని, గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నీచుడు ఆయనని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఇండిపెండెంట్‌ ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు, నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామ సర్పంచ్‌ దోనూరు సుశీల సోమవారం నల్లగొండలో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ చైతన్యాన్ని చూపుతున్నారని, మునుగోడును కలిసికట్టుగా అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారన్నారు. కేసీఆర్‌ సభ అనగానే గ్రామాల్లో సంతోషం నెలకొందని, ఆయనను చూసేందుకు మునుగోడు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులు, వ్యాపారాలే ముఖ్యం తప్ప ప్రజలు కాదన్నారు. ప్రజా కంఠక పార్టీ అయిన బీజేపీలో చేరి రాజగోపాల్‌రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నారని, ఆయనకివే చివరి ఎన్నికలని చెప్పారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2022-08-16T09:20:39+05:30 IST