మతసామరస్యానికి ప్రతీక మొహరం

ABN , First Publish Date - 2022-08-10T04:39:19+05:30 IST

చక్రాయపేట మండలంలో సురభి రెడ్డివారిపల్లె, చిలేకాంపల్లె గ్రామాలలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మతసామరస్యానికి ప్రతీక మొహరం
చక్రాయపేటలో సురభి రెడ్డివారిపల్లె ఒడ్డువాగు వంకలో జల్జికి వెళ్లిన పీర్లు

చక్రాయపేట, ఆగస్టు 9 : చక్రాయపేట మండలంలో సురభి రెడ్డివారిపల్లె, చిలేకాంపల్లె గ్రామాలలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు కులమతాలకు అతీతంగా నిర్వహించారు. గత వారం రోజులుగా రకరకాల వేడుకలు జరిపి మంగళవారం పీర్లు జల్జికి వెళ్లాయి. వెళ్లే ముందు పీర్లు ఊరేగింపుగా గ్రామాలు తిరుగుతూ పూలతో ముంచెత్తివేస్తారు. సురభి రెడ్డివారిపల్లెలో ఎక్కడా లేని విధంగా వేడుకలు జరుగుతాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా సురభిరెడ్డివారిపల్లెకు, చిలేకాంపల్లె గ్రామానికి వస్తారు. 

Updated Date - 2022-08-10T04:39:19+05:30 IST