Uttar Pradesh : తప్పిపోయిన పదహారేళ్ళ బాలిక... బావిలో కనిపించిన మృతదేహం...

ABN , First Publish Date - 2022-05-28T22:01:53+05:30 IST

దాదాపు 12 రోజుల నుంచి కనిపించకుండాపోయిన పదహారేళ్ళ

Uttar Pradesh : తప్పిపోయిన పదహారేళ్ళ బాలిక... బావిలో కనిపించిన మృతదేహం...

భడోహి (ఉత్తర ప్రదేశ్) : దాదాపు 12 రోజుల నుంచి కనిపించకుండాపోయిన పదహారేళ్ళ బాలిక ఓ బావిలో నిర్జీవంగా కనిపించిందని పోలీసులు శనివారం తెలిపారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయని చెప్పారు. ఈ బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్థులు చూడగా ఈ హృదయవిదారక దృశ్యం కనిపించిందని తెలిపారు. 


పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ శనివారం విలేకర్లతో మాట్లాడుతూ, ఊంఝ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఉన్న ఓ బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో శుక్రవారం రాత్రి కొందరు గ్రామస్థులు పరిశీలించారని తెలిపారు. ఈ బావి అమర్ పాల్ సింగ్ అనే రైతు భూమిలో ఉందన్నారు. ఆ బావిలో ఓ బాలిక కాళ్ళు, చేతులు కట్టి ఉన్నట్లు చూశారన్నారు. ఈ మృతదేహాన్ని దాదాపు 10-12 రోజుల క్రితం పడేసి ఉంటారని తెలిపారు. తన కుమార్తె కనిపించడం లేదని మృతురాలి తండ్రి మే 16న ఫిర్యాదు చేశారన్నారు. మే 16 రాత్రి 8 గంటలకు ఆమె బహిర్భూమికి వెళ్లి, తిరిగి రాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. బాధితురాలి ఇంటికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని బావిలో ఆమె మృతదేహం దొరికిందన్నారు. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే వాదనను కొట్టిపారేయలేమన్నారు. నిందితులను గుర్తించి, పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2022-05-28T22:01:53+05:30 IST