పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-05-20T06:21:21+05:30 IST

మండల కేంద్రంలో పుచ్చ లపల్లి సుందరయ్య వర్ధంతిని సీపీఎం నాయకు లు గురువా రం నిర్వహించారు.

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి
రాయదుర్గంలో సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న సీపీఎం నాయకులు

విడపనకల్లు, మే 19: మండల కేంద్రంలో పుచ్చ లపల్లి సుందరయ్య వర్ధంతిని సీపీఎం నాయకు లు గురువా రం నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీపీఎం నాయకు డు రంగారెడ్డి మాట్లాడుతూ సుంద రయ్య కమ్యూనిస్టు నాయ కుడిగా ఎన్నో పోరాటా లు చేశారన్నారు. ఈ కార్య క్రమం లో హమాలీ యూని యన్‌ నా యకుడు రామాం జినే యులు తదితరులు పాల్గొన్నారు.

గుంతకల్లుటౌన్‌: పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు డీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల మనిషిగా  సుందరయ్య పేరుపొందారన్నారు.  ఈ కార్యక్రమం లో  నాయకులు దాసరి శ్రీనివాసులు, కసాపురం రమేష్‌, తిమ్మప్ప, రామూ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే సీఐటీయూ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో  శంకరానంద గిరిస్వామి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ నాయుడు, సీపీఎం నాయకులు మారుతీప్రసాద్‌, చంద్రశేఖర్‌, ఓబులేశు, అబ్దుల్లా, జ్యోతి పాల్గొన్నారు.

రాయదుర్గంరూరల్‌: పట్టణంలోని సీపీయం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని  సీపీఎం కమిటీ సభ్యులు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయ కులు నాగరాజు, మధు, తిమ్మరాజు, మంజు, కృష్ణానాయక్‌, శంకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అనిల్‌, నిఖిల్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:21:21+05:30 IST