కార్గిల్‌ యుద్ధ వీరులకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-07-27T05:13:38+05:30 IST

కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత సైనికులు చూపిన తెగువ, ధైర్య సాహసాలు మరువలేనివని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు.

కార్గిల్‌ యుద్ధ వీరులకు ఘన నివాళి

పోరుమామిళ్ల, జూలై 26 : కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత సైనికులు చూపిన తెగువ, ధైర్య సాహసాలు మరువలేనివని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. సోమవారం పోరుమామిళ్లలోని ఆది ఆంధ్రపాలెం సమీపంలో ఉన్న ఎస్టీ కాలనీ వద్ద మాజీ సైనికుల ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివ్‌స కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన ఆర్మీ జవాన్ల స్థూపం వద్ద కార్గిల్‌లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, మాజీ సైనికులకు మెమెంటోలు అందించారు.  బద్వేలు మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ రమణారెడ్డి, రంగసముద్రం సర్పంచ్‌ చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ విజయప్రతా్‌పరెడ్డి పాల్గొన్నారు.


విద్యార్థుల ర్యాలీ

బద్వేలు, జూలై 26 : కార్గిల్‌ విజయ్‌ దివ్‌సను పురస్కరించుకుని పట్టణంలో రాచపూడి నాగభూషణం కళాశాల ఎన్‌సీసీ కేడెట్స్‌ సోమవారం కళాశాల నుంచి స్థానిక పోరుమామిళ్ల రోడ్డులోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఎన్‌సీసీ కేడెట్స్‌ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి సెల్యూట్‌ చేసి, మౌనం పాటించారు.  

Updated Date - 2021-07-27T05:13:38+05:30 IST