అసెంబ్లీ ఆవరణలో..సుష్మస్వరాజ్ విగ్రహాన్ని పెట్టాలి
ABN , First Publish Date - 2020-08-07T06:24:04+05:30 IST
అసెంబ్లీ అవరణలో సుష్మస్వరాజ్ విగ్రహాన్ని పెట్టాలని బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు
బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి
సంగెం, ఆగస్టు 6: అసెంబ్లీ అవరణలో సుష్మస్వరాజ్ విగ్రహాన్ని పెట్టాలని బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. గురువారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో కొండేటి శ్రీధర్ నేతృత్వంలో సుష్మస్వరాజ్ చిత్ర పటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శులు గాడిపెల్లి రాజేశ్వరరావు,కొండి జితేందర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాంరెడ్డి, జిల్లా అదికార ప్రతినిథి రాంబాబు, జిల్లా నాయకులు త్రిలోకేశ్వర్, నాయకులు సునిల్ రెడ్డి, గణేష్, ప్రవీణ్కుమార్,ఇర్సడ్ల సదానందంలతో పాటు పలువురు పాల్గొన్నారు.