Suicide: తోటి విద్యార్థుల ముందు అవమానించారని విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-26T16:14:59+05:30 IST
Hyderabad: తోటి విద్యార్థుల ముందు అవమానించారని ఓ విద్యార్థిని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన హయత్ నగర్లో చోటుచేసుకుంది. తమ కూతురి బలవన్మరణానికి టీచరే కారణమంటూ విద్యార్థిని
Hyderabad: తోటి విద్యార్థుల ముందు అవమానించారని ఓ విద్యార్థిని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన హయత్ నగర్లో చోటుచేసుకుంది. తమ కూతురి బలవన్మరణానికి టీచరే కారణమంటూ విద్యార్థిని కుటుంబసభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. హయత్ నగర్కు చెందిన అక్షయ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. హోం వర్క్స్ చేయలేదని అక్షయను టీచర్ తరగతి గదిలో మోకాళ్లపై నిలుచోబెట్టారు. తనను తోటి విద్యార్థుల ముందు అవమానించారని.. అక్షయ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఫ్యాన్కి ఉరేసుకుని అత్మహత్య చేసుకుంది. ఇటు విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగడంతో పోలీసులు మోహరించారు.