TS News: చెత్తపై కాలేశాడు.. ఒక్కసారిగా పేలుడు.. ఆ తరువాత ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-09-26T19:43:08+05:30 IST

నగరంలోని బాల్‌నగర్‌‌లో ఆకస్మికంగా పేలుడు సంభవించింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచ షీలా కాలనీలో సాల్వెంట్ డబ్బా ఒక్కసారిగా పేలింది.

TS News: చెత్తపై కాలేశాడు.. ఒక్కసారిగా పేలుడు.. ఆ తరువాత ఏమైందంటే...

హైదరాబాద్: నగరంలోని బాల్‌నగర్‌‌లో ఆకస్మికంగా పేలుడు సంభవించింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచషీలా కాలనీలో సాల్వెంట్ డబ్బా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పంచశీల కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న శీను అనే వ్యక్తికి గాయాలయ్యాయి. శ్రీను నడుస్తున్న సమయంలో  చెత్తపై పాదం మోపిన చోట ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో శీను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సదరు వ్యక్తిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా... కాలుకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు సగం కాలును తొలగించారు. ప్రస్తుతం శ్రీను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-09-26T19:43:08+05:30 IST