అతడికి ఇద్దరు భార్యలు.. పిల్లలు పుట్టడం లేదని మూడో పెళ్లి కూడా చేసుకున్న అతడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-17T21:41:26+05:30 IST

పిల్లలు కలగడం లేదనే కారణంతో ఓ వ్యక్తి ముగ్గురు భార్యలను వివాహం చేసుకున్నాడు. చివరకు కుటుంబ గొడవల కారణంగా మూడో భార్య దాడిలో గాయపడి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

అతడికి ఇద్దరు భార్యలు.. పిల్లలు పుట్టడం లేదని మూడో పెళ్లి కూడా చేసుకున్న అతడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే..

పిల్లలు కలగడం లేదనే కారణంతో ఓ వ్యక్తి ముగ్గురు భార్యలను వివాహం చేసుకున్నాడు. చివరకు కుటుంబ గొడవల కారణంగా మూడో భార్య దాడిలో గాయపడి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏపీలోని ఏలూరులో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


ఏలూరు నగరం తాపీమేస్త్రి కాలనీకి చెందిన మాచర్ల నాగేంద్రరావుకు భార్య పద్మావతితో పాటు, ఇంజనీరింగ్ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. అయితే ఇతడు గతంలోనే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేరనే కారణంతో విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడో భార్యకు పిల్లలు కలగడంతో ప్రస్తుతం నగరంలోని పత్తేబాదలో టైలరింగ్‌ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల నాగేంద్రరావు, పద్మావతి మధ్య విభేదాలు తలెత్తాయి. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మరింత ఎక్కువయ్యాయి. శనివారం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే తర్వాత అతను నిద్రిస్తున్న సమయంలో నాగేంద్రరావు మర్మాంగాలపై భార్య.. మరుగుతున్న వేడినీటిని పోసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.


ఉన్నట్టుండి వేడి నీటిని పోయడంతో బాధితుడు పెద్దగా కేకలు పెట్టాడు. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఏలూరు టూటౌన్‌ సీఐ బోనం ఆదిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థికపరమైన కారణాలా, లేదా వివాహేతర సంబంధమైన కారణాలతో ఇలా చేసిందా అనే కోణంతో పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2021-10-17T21:41:26+05:30 IST