వెయ్యి దాటాయి!
ABN , First Publish Date - 2022-01-23T06:11:27+05:30 IST
జిల్లాలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా వెయ్యి దాటాయి.
కొత్తగా జిల్లాలో 1,001 కరోనా పాజిటివ్లు
ఒంగోలులో 390 నమోదు
ఒంగోలు (కార్పొరేషన్), జనవరి 22 : జిల్లాలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా వెయ్యి దాటాయి. 24 గంటల వ్యవధిలో 1,001 పాజిటివ్లు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా ఒంగోలులో 390 ఉన్నాయి. అద్దంకిలో 71, కనిగిరిలో 52, మార్టూరులో 46, కందుకూరులో 35, కొరిశపాడులో 35, నాగులుప్పలపాడులో 34, కొత్తపట్నంలో 30,మద్దిపాడులో 30,ఇంకొల్లులో 27, చీరాలలో 22 నిర్ధారణ అయ్యాయి.టంగుటూరులో 19, కారంచేడులో 15, పర్చూరులో 14, యద్దనపూడిలో 14, పామూరులో 13, బల్లికురవలో 12,ఎస్ఎన్పాడులో 12, చీమకుర్తిలో 11, జె.పంగులూరులో 11 మంది వైరస్ బారిన పడ్డారు. వేటపాలెంలో 11,హెచ్ఎంపాడులో 10, పీసీపల్లిలో 10 కేసులు వచ్చాయి. మరో 27 మండలాల్లోనూ పది లోపు పాజిటివ్లు నమోదయ్యాయి.