సమరయోధుల కుటుంబాల వారసులకు సత్కారం
ABN , First Publish Date - 2022-08-15T06:14:06+05:30 IST
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాట సమయంలో అతిథ్యం ఇచ్చిన కుటుంబీకుల వారసులు చిటికెల భాస్కరనాయుడు, గాంగంటందొర వారసులైన గాం బోడిదొరలను ఆదివారం జిల్లా హౌసింగ్ పీడీ పి.కూర్మనాయుడు, గొలుగొండ డిప్యూటీ తహసీల్ధార్ ఆనంద్లు ఘనంగా సత్కరించారు.
కృష్ణాదేవిపేట, ఆగస్టు 14: విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాట సమయంలో అతిథ్యం ఇచ్చిన కుటుంబీకుల వారసులు చిటికెల భాస్కరనాయుడు, గాంగంటందొర వారసులైన గాం బోడిదొరలను ఆదివారం జిల్లా హౌసింగ్ పీడీ పి.కూర్మనాయుడు, గొలుగొండ డిప్యూటీ తహసీల్ధార్ ఆనంద్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గాం బోడిదొరను సత్కరించిన అనంతరం రూ.2,500 నగదును అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జలపు మణికుమారి, ఎంపీడీవో డేవిడ్రాజు, హౌసింగ్ ఏఈ మధు, డీటీ ఆనంద్, ఈవోపీఆర్డీ రఘు, కార్యదర్శులు అప్పారావు, శ్రీనివాస్, కుమార్, రాజేష్, వీఆర్వోలు శ్రీధర్, పద్మ పాల్గొన్నారు.