చేనేత కార్మిక నాయకులకు సన్మానం
ABN , First Publish Date - 2022-07-03T05:10:53+05:30 IST
ఏపీ చేనేత కార్మిక సంఘం నూత నంగా నియమితులైన నాయకులను జాతీయ చేనేత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మదనపల్లె అర్బన్, జూలై 2: ఏపీ చేనేత కార్మిక సంఘం నూత నంగా నియమితులైన నాయకులను జాతీయ చేనేత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏపీ చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ముష్ఠూరు రామమోహన్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా జేవి రమణ, ఉపాథ్యక్షుడిగా గుంపు వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గా తిరుమలేష్, వర్క్ంగ్ ప్రెసిడెంట్గా నియమితులైన సురేం ద్రరెడ్డిలను పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను పరి ష్కారానికి కృషి చేస్లామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత సేవాసంఘం నాయకులు గోపాలకృష్ణ, జేసీ బాలముల శేఖర్, రామిశెట్టినాగరాజ, పాల్గుణ,వేల్పుల నాగార్జున, ఉలస మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.