ముగ్గురి అఘాయిత్యం...గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక

ABN , First Publish Date - 2020-10-09T13:25:29+05:30 IST

యూపీలోని హాథ్రస్ ఘటన మరవక ముందే గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది....

ముగ్గురి అఘాయిత్యం...గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక

దాయాదుల దారుణం 

సూరత్ (గుజరాత్): యూపీలోని హాథ్రస్ ఘటన మరవక ముందే గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలోని నవసరి జిల్లాలో వ్యవసాయ కూలీ కుమార్తె అయిన 12 ఏళ్ల బాలికపై తన ముగ్గురు దాయాదులైన బాలురు గడచిన ఐదు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. దీంతో 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఆమె బంధువుల్లో ఓ బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం విషయాన్ని మరో ఇద్దరు దాయాదులకు చెప్పాడు. దీంతో వారు కూడా బాలికపై అత్యాచారం చేసి తల్లికి చెప్పవద్దని బెదిరించారు. నిందితులంతా 18ఏళ్ల వయసులోపు వారే. కొన్ని రోజుల క్రితం బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమెను తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వైద్యుల పరీక్షలో బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలికను చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. 


గురువారం మధ్యాహ్నం పోలీసులు ఆసుపత్రికి వచ్చి బాలికతోపాటు ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ముగ్గురు బాలురపై కేసు నమోదు చేశామని వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వివరించారు.

Updated Date - 2020-10-09T13:25:29+05:30 IST