Viral Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. నెట్టింట వైరల్‌గా మారిన 22 సెకన్ల వీడియో..!

ABN , First Publish Date - 2022-09-26T21:26:59+05:30 IST

సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో ఒక్కోసారి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. రైలు ప్రయాణ సమయాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండడం..

Viral Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. నెట్టింట వైరల్‌గా మారిన 22 సెకన్ల వీడియో..!

సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో ఒక్కోసారి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. రైలు ప్రయాణ సమయాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. కదులుతున్న రైలు నుంచి దిగబోయే క్రమంలో కొందరు, ఎలాగైనా రైలును ఎక్కాలనే ఆత్రుతతో మరికొందరు, పట్టాలు దాటుతూ ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తు కొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్వే స్టేషన్‌లో అంతా చూస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 22సెకన్ల ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది...


కోయంబత్తూర్‌ రైల్వే స్టేషన్‌లో (Coimbatore Railway Station) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి కదిలేందుకు సిద్ధంగా ఉంటుంది. అయితే తీరా కదిలే సమయంలో ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వస్తాడు. అప్పటికే రైలు వెళ్తూ ఉంటుంది. అయితే ఎలాగైనా రైలును ఎక్కాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ వెళ్తాడు. బోగీలోకి ఎక్కే సమయంలో అదుపుతప్పి కిందపడిపోతాడు. దీంతో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోతాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ (Railway Protection Force) ASI అరుణ్‌జీత్, లేడీ హెడ్ కానిస్టేబుల్ మనీ.. అతన్ని గమనిస్తారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అతన్ని గట్టిగా పట్టుకుని పక్కకు లాగే ప్రయత్నం చేస్తారు. అక్కడే ఉన్న ప్రయాణికులు కొందరు వారికి సాయం చేస్తారు. ఎట్టకేలకు అతన్ని కిందపడిపోకుండా కాపాడతారు. వారు గమనించకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగుండేది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీరు నిజమైన హీరోలంటూ.. కామెంట్లు పెడుతున్నారు.  





Updated Date - 2022-09-26T21:26:59+05:30 IST