పట్టణ సమగ్రాభివృద్ధికి సీపీఐ వార్డుల పర్యటన

ABN , First Publish Date - 2022-07-07T05:26:21+05:30 IST

పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో ప్రజల సమస్యల పరిష్కారం,అభివృద్ధికి ఈ నెల 8,9,10 తేదీలలో సీపీఐ ఆఽధ్వర్యంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్‌ తెలిపారు.

పట్టణ సమగ్రాభివృద్ధికి సీపీఐ వార్డుల పర్యటన
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నేతలు

బద్వేలు, జూలై 6: పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో ప్రజల సమస్యల పరిష్కారం,అభివృద్ధికి  ఈ నెల 8,9,10 తేదీలలో సీపీఐ ఆఽధ్వర్యంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ  జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్‌ తెలిపారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయం జేవీ భవన్‌లో  జరిగిన పార్టీ పట్టణ  సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌  ఎన్నికల సమయంలో వైసీపీ వారు ఇచ్చిన హామీలకు రెండేళ్లు గడిచినప్పటికీ ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. డ్రైనేజీ, మురికి  తదితర సమస్యలతో మున్సిపాలిటీలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.వైసీపీ తీరుపట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి జకరయ్య, పట్టణ కార్యదర్శి బాలు, జిల్లా సమితి సభ్యులు చంద్రమోహన్‌రాజు,  సహాయకార్యదర్శులు అనిల్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:26:21+05:30 IST