మూడేళ్ల పాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T06:16:49+05:30 IST

వైసీపీ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

మూడేళ్ల పాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 

గాజువాక, జూన్‌ 30: వైసీపీ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అట్టర్‌ ఫ్లాఫ్‌ కావడంతో ప్లీనరీలో పేరిట నాయకులు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ స్ధాయి గుర్తింపు కలిగిన విశాఖను విధ్వంస నగరంగా మార్చారని విమర్శించారు. గాజువాకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలను స్ధానిక ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీని వాస్‌, కార్పొరేటర్‌లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, నాయకులు నాగేశ్వరరావు, నమ్మి సింహాద్రి, ఎ.శ్రీనివాసరావు, చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:16:49+05:30 IST