AP News: మచిలీపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళా వ్యవసాయి కూలి మృతి

ABN , First Publish Date - 2022-09-02T19:25:50+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

AP News: మచిలీపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళా వ్యవసాయి కూలి మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కాలేఖాన్ పేటకు చెందిన అర్జా సీతారావమ్మ(35) వ్యవసాయ పనులకు వెళ్లగా ఒక్కసారిగా పడిన పిడుగుపాటుకు అక్కడిక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న మరో ఐదుగురు వ్యవసాయ కూలీలు గాయాలపాలవ్వగా వెంటనే వారి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీతారావమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీ యువ నాయకుడు పేర్ని కిట్టు పరామర్శించారు.

Updated Date - 2022-09-02T19:25:50+05:30 IST