బైక్‌పై నుంచి జారిటిప్పర్‌ కింద పడిన మహిళ

ABN , First Publish Date - 2021-07-26T05:20:52+05:30 IST

బైక్‌పై నుంచి జారిటిప్పర్‌ కింద పడిన మహిళ

బైక్‌పై నుంచి జారిటిప్పర్‌ కింద పడిన మహిళ
ప్రమాద స్థలం వద్ద క్షతగాత్రులు

కేశంపేట: బైక్‌పై నుంచి జారి పడిన మహిళ టి ప్పర్‌ కింద పడడంతో చెయ్యి నుజ్జునుజ్జు అయింది. వివ రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు చెందిన రాధిక, ఆమె కుమారుడు కిషోర్‌తో కలిసి ఆదివారం కేశంపేట మండలం నిర్దవెల్లిలో బంధువు అంత్యక్రియలకు హాజరై బైక్‌పై తిరిగి వెళ్తుండగా.. కోనాయపల్లి గ్రామ స మీపంలో ఎదురుగా టిప్పర్‌ వచ్చింది. బైక్‌కు సైడ్‌ ఇచ్చే క్రమంలో టిప్పర్‌ డ్రైవర్‌ రోడ్డు దింపి ఒక్కసారిగ రోడ్డు పైకి ఎక్కించాడు. దీంతో ఆందోళనకు గురైన కిషోర్‌ బైక్‌ను రోడ్డు దింపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్‌ పై వెనుక కూర్చున్న రాధిక జారి పడింది. దీంతో టిప్పర్‌ ఆమె చేతిపై నుంచి వెళ్లింది. రాధిక చెయ్యి నుజ్జయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. అ యితే ఈ ప్రమాదం పట్ల తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై కోన వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2021-07-26T05:20:52+05:30 IST