మనమ్మాయి పరువు తీస్తోంది.. భర్తను రెచ్చగొట్టి కూతురినే చంపించిన భార్య.. అసలు నిజం తెలిసి అవాక్కైన భర్త..!

ABN , First Publish Date - 2021-12-28T20:36:06+05:30 IST

ఆమె కూతురి గురించి భర్తకు లేని పోని విషయాలు చెప్పింది.. వేరే వ్యక్తితో తిరుగుతూ మన పరువు తీస్తోందని ఆరోపణలు చేసింది..

మనమ్మాయి పరువు తీస్తోంది.. భర్తను రెచ్చగొట్టి కూతురినే చంపించిన భార్య.. అసలు నిజం తెలిసి అవాక్కైన భర్త..!

ఆమె కూతురి గురించి భర్తకు లేని పోని విషయాలు చెప్పింది.. వేరే వ్యక్తితో తిరుగుతూ మన పరువు తీస్తోందని ఆరోపణలు చేసింది.. భార్య మాటలతో రెచ్చిపోయిన భర్త కన్నకూతురినే పొట్టన పెట్టుకున్నాడు.. గొంతు నులిమి చంపేశాడు.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న అతను అవాక్కయ్యాడు.. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు భార్య అంత నాటకం ఆడిందని తెలిసి షాకయ్యాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భర్త నాగేంద్ర, కూతురు ప్రతిభ (22)తో కలిసి నివసిస్తున్న కమల అనే మహిళకు రామ్ నరేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతనిని తరచుగా కలుస్తూ ఉండేది. ఇటీవల అతనితో కలిసి ఉండగా కూతురు ప్రతిభకు దొరికిపోయింది. కూతురు తన వివాహేతర సంబంధం గురించి భర్తకు చెప్పేస్తుందేమోనని కమలకు భయం పట్టుకుంది. దాంతో ఓ మాస్టార్ ప్లాన్ వేసింది. కూతురి గురించి భర్తకు చెడుగా చెప్పడం ప్రారంభించింది తన ప్రియుడు రామ్ నరేష్‌ను కూతురి ప్రియుడని భర్తకు చెప్పింది. పెద్ద వయసు వ్యక్తితో తిరుగుతూ కూతురు మన పరువు తీస్తోందని భర్తను రెచ్చగొట్టింది.


భార్య మాటలు విన్న నాగేంద్ర.. కూతురిపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 22న కూతురితో గొడవ పడి ఆమెను చంపేశాడు. ముందు గొంతు నులిమి ఆ తర్వాత ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణలో పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. తన వివాహేతర సంబంధాన్ని కప్పి పుచ్చుకునేందుకు భర్తతోనే కూతురిని కమల చంపించిందని తేల్చారు. 


Updated Date - 2021-12-28T20:36:06+05:30 IST