65ఏళ్ల వృద్ధుడితో వివాహేతర సంబంధం.. ఉన్నట్టుండి మహిళ అదృశ్యం.. చివరగా వృద్ధుడు చెప్పిన కారణాలు విని..

ABN , First Publish Date - 2021-12-23T01:53:16+05:30 IST

ఆమెకు 46ఏళ్లు.. భర్తతో హాయిగా కాపురం చేస్తున్న క్రమంలో ఆమెకు ఓ రోజు ఫోన్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తిగా పరిచయమైన 65 ఏళ్ల వృద్ధుడు.. చివరకు ఆమెకు దగ్గరయ్యాడు. భర్తకు తెలీకుండా ఆ వృద్ధుడితో..

65ఏళ్ల వృద్ధుడితో వివాహేతర సంబంధం.. ఉన్నట్టుండి మహిళ అదృశ్యం.. చివరగా వృద్ధుడు చెప్పిన కారణాలు విని..
సుజాత(ఫైల్), వేలుస్వామి

ఆమెకు 46ఏళ్లు.. భర్తతో హాయిగా కాపురం చేస్తున్న క్రమంలో ఆమెకు ఓ రోజు ఫోన్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తిగా పరిచయమైన 65 ఏళ్ల వృద్ధుడు.. చివరకు ఆమెకు దగ్గరయ్యాడు. భర్తకు తెలీకుండా ఆ వృద్ధుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అక్రమ సంబంధాలు ఎన్నో రోజులు సాగవని తెలిసినా.. తీరు మార్చుకోలేదు. ఓ రోజు ఉన్నట్టుండి ఆమె కనిపించకుండా పోయింది. చివరగా వృద్ధుడు చెప్పిన కారణాలు విని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని తిర్పూర్‌ పరిధి తిరుమురుగన్ పూండీ ప్రాంతంలో ప్రకాష్(50), సుజాత(46) దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రకాష్ సొంతంగా లారీ నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు సుజాతకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓ రోజు ఇద్దరూ కలుసుకున్నారు. ఆ అపరిచిత వ్యక్తి తారాపురం సమీపంలోని శకునిపాలయం ప్రాంతానికి చెందిన వేలుస్వామి(65) అని తెలిసింది. 15ఏళ్ల క్రితమే అతడి భార్య చనిపోవడంతో కూతురుకు పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్నాడు.

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..


వృద్ధుడి గురించి తెలిసినా సుజాత.. అతన్ని రోజూ కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో సుజాతకు అవసరం వచ్చినప్పుడల్లా డబ్బులు ఇస్తుండేవాడు. అయితే ఇటీవల సుజాత మరింత ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. డబ్బులు ఇవ్వకుంటే అందరికీ చెబుతానని సుజాత బెదిరించింది. బయట తెలిస్తే పరువు పోతుందని గ్రహించిన వృద్ధుడు.. ఎలాగైనా సుజాతను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 19న ఆమెకు ఫోన్ చేసి తారాపురం రావాలని సూచించాడు.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!


వృద్ధుడు చెప్పినట్లుగానే సుజాత అక్కడికి వెళ్లింది. అక్కడ మళ్లీ డబ్బుల విషయమై గొడవ జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధుడు.. ఆమెను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె దుస్తులన్నింటినీ తొలగించి, మృతదేహాన్ని కవుంతక్కి ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. సోమవారం స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సుజాత కాల్ డేటా ఆధారంగా వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాధచాయలు అలుముకున్నాయి.

పెళ్లయి నెల కూడా కాకముందే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త బలవన్మరణం.. షాకింగ్ నిజాలు చెప్పిన మరిది

Updated Date - 2021-12-23T01:53:16+05:30 IST