ప్రకాశం జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య
ABN , First Publish Date - 2022-09-24T00:03:05+05:30 IST
జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య కలకలం రేపింది.పాతకక్షలతో వైసీపీ నేత పసుపులేటి రవితేజను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.
ప్రకాశం: జిల్లాలో వైసీపీ(ycp) నేత దారుణ హత్య కలకలం రేపింది.పాతకక్షలతో వైసీపీ నేత పసుపులేటి రవితేజ(Ravi Teja)ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. బైక్పై వెళ్తున్న రవితేజను ప్రత్యర్థులు లారీతో తొక్కించి చంపారు. వైసీపీలో మరో వర్గమే ఈ హత్య చేయించిందని.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలంటూ..సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన చేపట్టారు. బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరగడంతో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో సింగరాయకొండలో పోలీసులు భారీగా మోహరించారు.