అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..

ABN , First Publish Date - 2022-09-22T01:00:30+05:30 IST

ప్రస్తుతం చాలా మంది యువకులు.. చిన్న చిన్న సమస్యలకే మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో చివరకు దారుణాలకు పాల్పడడమో, లేక అంతే దారుణంగా...

అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..

ప్రస్తుతం చాలా మంది యువకులు.. చిన్న చిన్న సమస్యలకే మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో చివరకు దారుణాలకు పాల్పడడమో, లేక అంతే దారుణంగా మోసపోవడమో జరుగుతుంటుంది. కొందరైతే హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుటారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడి విషయంలో ఇలాగే జరిగింది. ‘‘అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు’’.. అంటూ లేఖ రాసిన యువకుడు చివరకు షాకింగ్ నిర్ణయం (Shocking decision) తీసుకున్నాడు. ఈ విషాధ ఘటనకు (Tragic incident) సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌లోని హజీరా పరిధి టికోనియా పార్క్ కంచమీల్‌ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సాహిల్ చౌహాన్ (20).. మేకప్ ఆర్టిస్టుకు సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి కోచింగ్ ముగించుకుని తన గదికి వెళ్లాడు. దిగులుగా ఉండడంతో అలసిపోయాడేమో అని తల్లిదండ్రులు భావించారు. అయితే అర్ధరాత్రి కొడుకు గదిలోకి వెళ్లి చూసేసరికి ఉరికి వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గదిలో సూసైడ్ నోట్‌ను (Suicide note) స్వాధీనం చేసుకున్నారు. అందులో, ‘‘ 15ఏళ్ల బాలుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన పట్ల తప్పుగా ప్రవర్తించడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

ప్రియుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ యువతి ఆగ్రహం.. చివరకు మద్యం మత్తులో ఆమె చేసిన పని..


‘‘రోజూ డబ్బులు డిమాండ్ చేయడంతో పాటూ తరచూ మానసికంగా వేధిస్తున్నాడు. అతను నాకంటే చిన్న వాడు కావడంతో బయట ఎవరికి చెప్పినా నమ్మరు. దీంతో చివరకు నా పగ తీర్చుకుని, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మా, నాన్నా... వచ్చే జన్మంటూ ఉంటే మిమ్మల్ని మళ్లీ కలుస్తా’’.. అని రాసి ఉంది. మంగళవారం నుంచి బాలుడు కూడా కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో జేసీ మిల్లు ఆవరణలో అదృశ్యమైన యువకుడి సైకిల్‌ కనిపించింది. బాలుడి తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..



Updated Date - 2022-09-22T01:00:30+05:30 IST