నాచారం హల్దీ వాగులో యువకుడు గల్లంతు
ABN , First Publish Date - 2022-10-07T05:57:20+05:30 IST
మండలంలోని నాచారం వద్ద హల్దీవాగు ప్రవాహంలో అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.
వర్గల్, అక్టోబరు 6: మండలంలోని నాచారం వద్ద హల్దీవాగు ప్రవాహంలో అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఎల్లంకుల స్వామి (29) గురువారం ఉదయం నాచాగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి స్వామివారి దర్శనం కోసం బైక్పై వెళ్లారు. దర్శనం అనంతరం స్వామి ఆలయం పక్కనే ఉన్న హల్దీవాగు లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వెళ్లాడు. వాగు ప్రవాహం అధికంగా ఉండటంతో బైక్తో పాటు స్వామి వాగులో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హల్దీ వాగులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ స్వామి ఆచూకీ లభ్యం కాలేదు. స్వామి తండ్రి ఎల్లంకుల నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.