స్నేహితుడికి కత్తి చూపించి చంపేస్తానని బెదిరించాడు.. భయపడిన అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-03-16T17:55:45+05:30 IST

వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు..

స్నేహితుడికి కత్తి చూపించి చంపేస్తానని బెదిరించాడు.. భయపడిన అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఈ నేపథ్యంలో చిన్న గొడవ వారి మధ్య చిచ్చు పెట్టింది.. ఘర్షణ సమయంలో ఒక యువకుడు కత్తి చూపించి మరో యువకుడిని చంపేస్తానని బెదిరించాడు.. భయపడిన ఆ యువకుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.. అర్ధరాత్రి సమయంలో తిరిగి వెళ్లి తనను చంపేస్తానని బెదిరించిన యువకుడిని చంపేశాడు. 


ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో నాను సారథి (19), సంజు సాహు (18) అనే ఇద్దరు యువకులు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగాల నుంచి వచ్చిన తర్వాత కలిసి తిరిగేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం వీరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ కొట్టుకున్నారు. ఆ సమయంలో నాను కత్తి తీసి సంజును బెదిరించాడు. చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిన సంజు భయపడి పారిపోయాడు. అర్ధరాత్రి తిరిగి వెళ్లి ఓ పెద్ద బండరాయితో నాను తలపై మోది చంపేశాడు. 


అనంతరం సమీపంలోని ఓ గుడికి వెళ్లి అక్కడ పడుక్కున్నాడు. పక్కింటి వ్యక్తి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాను మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. గంట వ్యవధిలోనే సంజును పట్టుకుని విచారించారు. తనను కత్తితో పొడిచి చంపేస్తానని నాను బెదిరించాడని, అందుకే భయపడి అతడిని చంపేశానని సంజు చెప్పాడు. సంజును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2022-03-16T17:55:45+05:30 IST